టీమిండియా కోచ్గా VVS లక్ష్మణ్
NEWS Jul 09,2026 10:59 am
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే, ఈ నెల 23 నుంచి 27 మధ్య జింబాబ్వేతో టీమిండియా 3 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో లక్ష్మణ్తో పాటు బ్యాటింగ్ కోచ్గా హృషికేష్ కనిత్కర్, బౌలింగ్ కోచ్గా సునీల్ జోషి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆ తర్వాత జపాన్లో జరగనున్న ఆసియా క్రీడలకు కూడా లక్ష్మణే కోచ్గా కొనసాగుతారు. ఆ సమయంలో భారత సీనియర్ జట్టు స్వదేశంలో వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడనుండటంతో, రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆ జట్టుతో ఉంటారు. గతంలోనూ లక్ష్మణ్ ఇలా ద్వితీయ శ్రేణి భారత జట్టుకు కోచ్గా సేవలు అందించారు.