మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
NEWS Jul 09,2026 10:56 am
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్ నంబర్ 3-5-128కు సంబంధించిన అసెస్మెంట్ సర్టిఫికేట్ను నకిలీగా రూపొందించి, కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం అదే నకిలీ పత్రాన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ పత్రాల తయారీ వెనుక ఉన్న వ్యక్తులు, కుట్రలో పాల్గొన్న వారిని గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.