ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డికి PRTU శుభాకాంక్షలు
NEWS Jul 07,2026 06:35 am
శాసనసభ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, శాసనమండలి రూల్స్ కమిటీ సభ్యుడిగా 2026–27 సంవత్సరానికి నియమితులైన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డికి పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సంఘం అభినందనలు తెలిపింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, ప్రజా ప్రయోజనాల కోసం ఆయన సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం తరఫున అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.