కోరుట్ల బాలికల ప్రతిభకు జాతీయ గుర్తింపు
NEWS Jul 07,2026 10:49 am
కోరుట్ల PM SHRI జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు రూపొందించిన ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ ప్రాజెక్ట్ జాతీయ స్థాయి **'వికసిత్ భారత్ బిల్డ్థాన్'**కు ఎంపికైంది. విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ IAS, విద్యార్థినులు, HM వడ్లకొండ గంగాధర్, సైన్స్ ఉపాధ్యాయుడు చందా నాగరాజును ప్రశంసిస్తూ అభినందన పత్రం అందజేశారు. 'వోకల్ ఫర్ లోకల్' థీమ్తో రూపొందించిన ఈ ఆవిష్కరణకు జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.