తాజ్మహల్ గతంలో శివాలయమా?
NEWS Jul 07,2026 10:55 am
ఆగ్రా: తాజ్మహల్ వాస్తవానికి శివాలయమేనని, అది ‘తేజో మహాలయ’గా ఉండేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖకి నోటీసులు జారీ చేసింది. తాజ్మహల్ను పరిశీలించి ఫొటోలు, వీడియోలు సేకరించేందుకు అడ్వకేట్ కమిషనర్ను నియమించాలని పిటిషనర్లు కోరారు. ట్రయల్ కోర్టు, రివిజనల్ కోర్టులు ఈ అభ్యర్థనను తిరస్కరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనకు నిర్మాణ, వాస్తు ఆధారాలు అవసరమని పిటిషనర్లు తెలిపారు. దీనిపై కేంద్రం, ASI తమ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.