ఏకగ్రీవంగా వన సంరక్షణ కమిటీ
NEWS Jul 06,2026 06:48 pm
రాయికల్ (మం) చింతలూరు గ్రామంలో వన సంరక్షణ కమిటీ (వీఎస్ఎస్)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా ముంజం ప్రణయ్, ఉపాధ్యక్షురాలిగా కదుర్లి లక్ష్మిని ఎంపిక చేశారు. మొత్తం 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామంలో అటవీ సంరక్షణ, మొక్కల పరిరక్షణ, పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాలని సభ్యులు నిర్ణయించారు. గ్రామ పెద్దలు, సభ్యులు పాల్గొని కమిటీ విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.