ఎమ్మిగనూరు ఆసుపత్రిపై ఎమ్మెల్యే సమీక్ష
NEWS Jul 06,2026 06:13 pm
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే డా. బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రి పనితీరు, పారిశుద్ధ్యం, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ప్రసూతి విభాగం, తాగునీటి సౌకర్యం, ఖాళీ వైద్యుల పోస్టుల భర్తీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం అత్యధిక సురక్షిత ప్రసవాలు నిర్వహించి విశిష్ట సేవలు అందించిన వైద్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి అభినందించారు.