ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్నారు. విమానాశ్రయానికి స్వయంగా విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయనకు స్వాగతం పలికారు. మోదీ విమానానికి ఇండోనేషియా యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా నిలిచాయి. ఇరు దేశాల రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల బలోపేతంపై ఇరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. సాంస్కృతిక బంధానికి ప్రతీక ప్రసిద్ధ ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని మోదీ సందర్శిస్తారు. 2025-26లో ఇరు దేశాల వాణిజ్యం 24.78 బిలియన్ డాలర్లకు చేరింది. అనంతరం మోదీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పర్యటిస్తారు.