కేకే, విజయలక్ష్మిలను కలిసిన అహ్మద్
NEWS Jul 06,2026 11:29 am
HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు (కేకే), రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మిలను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎస్.జె.కె. అహ్మద్ హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా, ఇటీవల రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మికి అహ్మద్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ భేటీలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.