ఎమ్మిగనూరు: కడివేళ్ల గ్రామంలో గత 15 రోజులుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యపై మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కల్పించారు. అయితే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామ నాయకులు కోరుతున్నారు.