ట్రంప్నకు మోదీ విషెస్!
NEWS Jul 04,2026 11:15 pm
అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్కు, అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్, అమెరికాలు కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మాత్రమే కాకుండా, అంతకుమించిన బలమైన స్నేహ సంబంధాలను కలిగి ఉన్నాయని మోదీ అన్నారు. ఇరు దేశాల్లోని ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, ప్రజల అపరిమిత సామర్థ్యాలు ప్రపంచ శ్రేయస్సుకు ఎంతో దోహదపడుతున్నాయని చెప్పారు. రాబోయే 250 ఏళ్లలో కూడా అమెరికా మరింత పురోగమించాలని, భారత్-అమెరికా ద్వైపాక్షిక బంధం కొత్త శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు.