హైకోర్టు జడ్జికి స్వాగతం పలికిన కలెక్టర్
NEWS Jul 04,2026 06:47 pm
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ జె. శ్రీనివాస్ రావు జిల్లా పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ శ్రీనివాస్ రావు జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని న్యాయమూర్తికి స్వాగతం పలికారు.