అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్పై ప్రశంసలు కురిపించారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘స్టోరీటైమ్ విత్ ది సెకండ్ లేడీ’ పిల్లల పోడ్కాస్ట్లో పాల్గొన్న ట్రంప్, “వైట్హౌస్లో మీరు చాలా ప్రజాదరణ పొందారు. మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు” అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్, ఉషా కలిసి ఓవల్ ఆఫీసులో పిల్లల పుస్తకాన్ని చదివారు. అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పనితీరును కూడా ట్రంప్ ప్రశంసించారు. భారత సంతతికి చెందిన తొలి అమెరికన్ సెకండ్ లేడీగా ఉషా వాన్స్ గుర్తింపు పొందారు.