కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా
50 మంది విద్యార్థినుల చదువు బాధ్యత
NEWS Jul 03,2026 09:43 pm
HYD:మాజీ మంత్రి కేటీఆర్ తన 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ ఏడాది నుంచి 50 మంది పేద విద్యార్థినుల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. సమాజానికి ఉపయోగపడేలా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నానని, విద్య ద్వారానే ఒక కుటుంబం, తద్వారా సమాజం ప్రగతి సాధిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.