మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్
NEWS Jul 03,2026 04:36 pm
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం టెంబూర్ణి గ్రామంలో గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చెట్ల పెంపకంతో స్వచ్ఛమైన వాతావరణం, ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాగరి ముత్యం, పంచాయతీ కార్యదర్శి శారద, జీపీవో శాంతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.