యాంటీ డ్రగ్స్పై అవగాహన సదస్సు
NEWS Jun 28,2026 08:48 pm
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానల్ అడ్వకేట్ మహమ్మద్ సాదిక్ పాషా మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, చైల్డ్ హెల్ప్లైన్-1098 సేవల ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.