బంగారం కొనొద్దు: మోదీ
NEWS Jun 28,2026 02:22 pm
ప్రధాని మోదీ మన్కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను వాయిదా వేయాలని కోరారు. కార్ పూలింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని, మెట్రో, బస్సుల వంటి ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించాలని సూచించారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ ఎరువులను ఉపయోగించాలని రైతులకు పిలుపునిచ్చారు. తన పిలుపుకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని, చాలామంది పాత బంగారాన్నే మార్పించుకుంటున్నారని, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని మోదీ తెలిపారు.