తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
NEWS Jun 28,2026 02:14 pm
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని చిన్ని కుటుంబానికి చెందిన బినామీ సంస్థ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని నాని సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను చిన్ని తీవ్రంగా ఖండిస్తూ, నాని ఈర్ష్య, ద్వేషంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులకు ఫిర్యాదులు చేసినా ఆరోపణల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని, పక్కకెళ్లి ఆడుకోవాలని కౌంటర్ ఇచ్చారు.