పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
NEWS Jun 28,2026 08:48 pm
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల శ్రీనివాసరావుతో పాటు 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి పల్స్ పోలియో కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పోలియో రహిత సమాజమే మనందరి లక్ష్యం కావాలన్నారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని అన్నారు.