పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
NEWS Jun 27,2026 11:30 pm
పాల్వంచ గాంధీనగర్లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు సందర్భంగా పీర్ల చావిడి నుంచి ముస్లిం సోదర సోదరీమణులు పట్టణ ప్రధాన వీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం 44వ డివిజన్ కార్పొరేటర్ విషశెట్టి విశ్వశ్వరరావు పీర్లను దర్శించుకోగా, మస్తాన్ ఖురేషి ఆయనను సన్మానించారు. ఎస్కే ఖదీర్ ఖురేషి, హకీమ్ ఖురేషి, యాకుబ్ ఖురేషి, ఆర్షద్, సయ్యద్ యూనుస్ తదితరులు పాల్గొన్నారు.