పల్స్ పోలియో విజయవంతం చేయాలి:
డీఎంహెచ్వో డా. తుకారాం రాథోడ్
NEWS Jun 27,2026 11:29 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్ జిల్లా వైద్యాధికారులు, సిబ్బందితో నిర్వహించిన జూమ్ సమీక్ష సమావేశంలో పల్స్ పోలియో కార్యక్రమంపై కీలక సూచనలు చేశారు. జూన్ 28 నుంచి ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, జిల్లాలో 0–5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.