పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా
టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
NEWS Jun 27,2026 11:30 pm
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా కాల్వ ప్రసాద్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ స్ఫూర్తితో పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజల మధ్య పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.