డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: SP
NEWS Jun 27,2026 11:27 pm
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత, రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత చట్టాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.