వైసీపీకి షాక్.. 50 మంది టీడీపీలోకి
NEWS Jun 24,2026 11:38 am
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. గోనెగండ్ల (మం) ఎర్రబాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో పెద్ద కౌలుట్లయ్య, చిన్న కౌలుట్లయ్య, పెద్ద కేశన్న, చిన్న కేశన్న కుటుంబాలకు చెందిన సుమారు 50 మంది టీడీపీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యేను భారీ గజమాలతో సన్మానించి తమ మద్దతు ప్రకటించారు.