బసవతారకం ఆస్పత్రి పేదలకు ధైర్యం
NEWS Jun 22,2026 10:21 pm
HYD: బసవతారకం ఆస్పత్రిని ఎంతోమంది క్యాన్సర్ బాధితుల పట్ల దేవాలయంగా తీర్చిదిద్దారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఎంతో మంది దాతలు సహకరించారని.. ప్రభుత్వాలు, పార్టీలు అండగా నిలిచాయని చెప్పారు. ఆస్పత్రి రజతోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరై మాట్లాడారు. ఇక్కడ ఏటా 8వేల మందికి సర్జరీలు చేస్తున్నారని తెలిపారు.