సాయి ఆలయాలకు నిధుల ఇవ్వం
NEWS Jun 22,2026 02:44 pm
శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించబోమని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. శ్రీవాణి నిధులు వైదిక, ఆగమ సంప్రదాయాలను అనుసరించే హిందూ ఆలయాల అభివృద్ధి కోసమేనని తెలిపారు. షిర్డీ సాయి ఆలయాలు ఆ పరిధిలోకి రావని, సనాతన ధర్మ ప్రచారం, వైదిక సంప్రదాయాల పరిరక్షణకే ఈ నిధులను వినియోగిస్తున్నామని చెప్పారు.