లారీ ఢీ కొని డీటీఓ వెంకన్న మృతి
NEWS Jun 22,2026 02:15 pm
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం (మం) చెల్పూరు శివారులో రవాణా శాఖ కార్యాలయం ఎదుట జిల్లా రవాణా అధికారి (డీటీఓ) వెంకన్న వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి ఆయనపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వెంకన్నకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భాంతి వ్యక్తం చేశారు.