ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు జూన్ 30 లోపు e-KYC పూర్తి చేయాలి. ఈ గడువులోగా చేయని వారికి జులై 1 నుండి కేంద్రం అందించే రూ. 300 సబ్సిడీ నిలిచిపోతుంది. గడువు తర్వాత చేస్తే.. ఆ తర్వాత తీసుకునే సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. ఈ-కేవైసీ ప్రక్రియ ఉచితం, దీనిని గ్యాస్ ఏజెన్సీలలో, సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద లేదా చమురు సంస్థల మొబైల్ యాప్ల ద్వారా పూర్తి చేసుకోవచ్చు.