యోగాసనాలు చేసిన చంద్రబాబు, లోకేశ్
NEWS Jun 22,2026 10:12 am
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యోగా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి యోగాభ్యాసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాల్లో కోటి మందికి పైగా ప్రజలు యోగా సాధన చేస్తున్నట్లు సీఎం తెలిపారు. యోగా, ఆధ్యాత్మికతతోనే హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతామని, ఆగస్టు 15 నుంచి ‘సంజీవని’ ప్రాజెక్టును అమలు చేస్తామని, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.