2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్
NEWS Jun 21,2026 11:20 am
తెలంగాణలో కీలకమైన మెట్రో విస్తరణ, రైల్వే పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించి, సమస్యలను తేల్చుకోవాలనే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే 2 రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటిస్తారు. కేంద్రం నుంచి నిధులు, అనుమతుల సాధన కోసం సీఎం ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టూర్కు ముందే సీఎం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. 22, 23 తేదీల్లో తాను ఢిల్లీలోనే అందుబాటులో ఉంటానని, రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై చర్చించేందుకు కేంద్ర రైల్వే మంత్రితో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయించాలని, కిషన్ రెడ్డి చొరవ చూపాలని రేవంత్ కోరారు.