డోన్ హైవేపై ₹4.50 కోట్ల బంగారం చోరీ
NEWS Jun 21,2026 11:05 am
నంద్యాల జిల్లా డోన్ హైవేపై సినీ సన్నివేశాన్ని తలపించేలా రూ.4.50 కోట్ల విలువైన 2.750 కేజీల బంగారాన్ని దొంగలు అపహరించారు. మోతిలాల్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బంగారంతో ప్రయాణిస్తుండగా, అనంతపురం నుంచి స్కార్పియో కారులో బస్సును ఫాలో చేసిన దొంగలు డోన్ సమీపంలో బ్యాగ్ను ఎత్తుకెళ్లారు. జడ్చర్ల చేరుకున్న తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితుడు డోన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.