యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం
NEWS Jun 21,2026 11:09 am
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో సభ్యులు యోగాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేస్తూ ధ్యానం చేశారు. ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల శారీరక, మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రముఖ వైద్యులు డాక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. యోగా ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం వాకింగ్ గ్రూప్ సభ్యులు డాక్టర్ దేవేందర్ రెడ్డిని ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.