మెట్పల్లి పట్టణంలోని హనుమాన్నగర్లో దాసరి రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆయన నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించారు. ఇది హత్యా? లేక ప్రమాదవశాత్తు జరిగిన మరణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.