హైదరాబాద్: బండి భగరీథ్కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు మే 16న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, నెల రోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉన్న అతను ఈ మధ్యాహ్నం విడుదలయ్యారు. ఈనెల 28 వరకు (వారం రోజులు) బెయిల్ మంజూరు చేస్తున్నట్టు జడ్జీ ఉత్తర్వులు జారీ చేశారు.