కార్పొరేటర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు
NEWS Jun 20,2026 01:37 pm
కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ నాలుగో డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి అశోక్ ఆధ్వర్యంలో DMHO సహకారంతో రాహుల్ గాంధీ నగర్ ఆదర్శ వెల్ఫేర్ ప్రాంగణంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన 15 మంది వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన రోగులకు మందులు పంపిణీ చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు సేవ చేయడ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, పొందూరు నరసింహారావు, వెంకట్, పోతన శెట్టి బ్రహ్మం, రఘు పతి రాజు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు