బ్రిడ్జి మరమ్మత్తు పనుల పరిశీలన
NEWS Jun 20,2026 11:36 am
లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న మరమ్మత్తు పనులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతి, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. వంతెన మరమ్మత్తుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాల్సి వస్తున్నందున స్థానిక ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.