స్మృతి మంధానకు అరుదైన గౌరవం
NEWS Jun 16,2026 06:21 pm
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందన అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకుంది. ప్రముఖ Time మ్యాగజైన్ 2026 సంవత్సరానికి ప్రకటించిన ‘క్రీడారంగంలో 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల’ జాబితాలో ఆమెకు స్థానం లభించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రీడాకారిణిగా స్మృతి నిలిచింది. ఈ ఘనతతో ఆమె ఫుట్బాల్ దిగ్గజాలు Lionel Messi, Cristiano Ronaldo, బాస్కెట్బాల్ స్టార్ LeBron James వంటి ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుల సరసన చేరి భారత క్రికెట్కు మరో గౌరవాన్ని తీసుకొచ్చింది.