ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని పాల్వంచ పట్టణ BRS పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు దుర్గాప్రసాద్ అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పట్టణ కేంద్రంలో జరిగిన సమావేశంలో చెప్పారు. ఆ బాలికకు ప్రభుత్వం తరఫున వైద్యం కూడా చేయించలేదన్నారు. వైద్యం కోసం ఆ పేద కుటుంబం రూ.70వేలు ఖర్చు చేశారని తెలిపారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలన్నారు.