అయోధ్య రాముడికి అరుదైన మామిడి
NEWS Jun 16,2026 06:10 pm
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్కు చెందిన ‘మియాజాకి’ మామిడిని అయోధ్య రాముడికి నైవేద్యంగా సమర్పించారు. స్థానిక రైతు ఓంప్రకాశ్ సింగ్ రెండేళ్ల క్రితం నాటిన ఈ మొక్క అయోధ్య వాతావరణంలో పెరిగి ఈ సీజన్లో డజను పండ్లు ఇచ్చింది. సంప్రదాయం ప్రకారం తొలి పండును తులసి దళంతో కలిసి రాముడికి అర్పించారు. ‘ఎగ్ ఆఫ్ ది సన్’గా ప్రసిద్ధి చెందిన ఈ మామిడి కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతుంది. రూబీ ఎరుపు రంగు, అద్భుతమైన తీపి, పీచు ఉండదు.