వైస్ కెప్టెన్గా తెలుగోడు.. వైభవ్ ఎంట్రీ
NEWS Jun 06,2026 02:43 pm
బీసీసీఐ ఎంపిక కమిటీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం టీ20 జట్టును ప్రకటించింది. ఈ టూర్ లో ముందుగా ఐర్లాండ్తో 2 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడిన తర్వాత, ఇంగ్లాండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు అక్కడకు పయనం కానుంది. ‘సర్పంచ్ సాబ్’ శ్రేయస్ అయ్యర్ ఈ జట్టును ముందుండి నడిపించనున్నాడు. హైదరాబాద్ కుర్రాడు, తెలుగు రాష్ట్రాల గర్వకారణం తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం విశేషం.