నచ్చిన చోటే 400 గజాల ఇళ్లు!
NEWS Jun 05,2026 10:05 pm
తెలంగాణలో పేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2026-27లో 3.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. కనీసం 400 చ.అ విస్తీర్ణంతో గృహాలు నిర్మించేందుకు డిజైన్లు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఇళ్ల యాజమాన్యంలో మహిళల పేరుతో హక్కులు కల్పించి వారి ఆర్థిక, సామాజిక భద్రతను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పేదలకు గౌరవప్రదమైన జీవితం అందించడమే ఈ గృహ నిర్మాణ కార్యక్రమం లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.