పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
: జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి
NEWS Jun 05,2026 10:07 pm
మెట్పల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్పల్లి కోర్టు ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జూ. సివిల్ జడ్జి వినుకొండ మాధవి మాట్లాడుతూ, గాలి, నీరు, నేల, చెట్లు, వన్యప్రాణులను సంరక్షించడమే పర్యావరణ రక్షణ అని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు మొక్కల పెంపకంతో పాటు కాలుష్య నియంత్రణ కూడా అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణకు భారత ప్రభుత్వం 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు.