మండల ప్రజాపరిషత్లో ఆవిర్భావ వేడుకలు
NEWS Jun 03,2026 12:16 am
మెట్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. ఎంఫీఓ ప్రదీప్ కుమార్, నరసింహారెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.