పీఎస్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
NEWS Jun 03,2026 12:15 am
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహించారు. సీఐ సురేష్బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన మహనీయుల సేవలను పోలీసులు స్మరించుకున్నారు. ఎస్సై కిరణ్కుమార్, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు జలంధర్, రామేశ్, సునీల్, శ్రీనివాస్, ధనుంజయ్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని అధికారులు పేర్కొన్నారు.