ఎమ్మెల్యే చొరవతో గీతాకార్మికులకు సాయం
NEWS Jun 03,2026 12:12 am
మెట్పల్లి: మెట్లచిట్టాపూర్ లోని ఈత వనం అగ్నిప్రమాదంలో చెట్లు, బోరు పంపుసెట్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన కలెక్టర్తో మాట్లాడి గ్రామానికి కొత్త బోర్వెల్, పంపుసెట్ మంజూరు చేయించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వులను గ్రామ సర్పంచ్ సుంకేట అరుణ గీతా కార్మికులకు అందజేశారు. ఎమ్మెల్యే చొరవతో సహాయం అందడంతో గీతా కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.