తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు
NEWS Jun 02,2026 11:35 am
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా NSS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశ్రీ గౌడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1945-48 మధ్య నిజాం దోపిడి పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం భూమి, ఆత్మగౌరవం కోసం జరిగిందని పేర్కొన్నారు. త్యాగాలతో సాధించిన తెలంగాణ మళ్లీ కొందరి చేతుల్లో కేంద్రీకృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు నిజమైన మేలు జరగాలంటే అవినీతి, దోపిడి రాజకీయాలు, కుటుంబ పార్టీలకు ముగింపు పలకాలని అన్నారు. భూసంస్కరణలు చేపట్టి భూమిలేని పేదలకు భూములు పంచడం, ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం, న్యాయం అందించడం ద్వారా సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. నిజాయితీ గల నాయకులను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.