ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్
NEWS Jun 01,2026 09:45 pm
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ను సదాశివనగర్ గ్రామ సర్పంచ్ వంకాయల శిరీష, రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్కు పూల బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. జానీ బాయ్, గిద్దె అశోక్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన అనంతరం సర్పంచ్ దంపతులు తమ గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు.