బాధితుడికి పైడి ఎల్లారెడ్డి సాయం
NEWS Jun 01,2026 09:42 pm
నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్కు గురై గాయపడిన వ్యక్తిని జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధితుడికి ఆర్థిక సహాయం అందజేసి, అవసరమైన వైద్య సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని డా. పైడి ఎల్లారెడ్డి ఆకాంక్షించారు.