పాల్వంచ విద్యార్థిని గిన్నీస్ రికార్డు!
NEWS May 31,2026 11:33 pm
పాల్వంచకు చెందిన గుఱ్ఱం సౌందర్య గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించి స్థానికంగా ప్రశంసలు అందుకుంది. హల్లెల్ మ్యాజిక్ స్కూల్ ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 2న హైదరాబాద్లోని జొరాస్ట్రియన్ క్లబ్లో 777 మంది పాల్గొన్న సామూహిక కీబోర్డ్ వాయిద్య ప్రదర్శనలో ఆమె భాగస్వామ్యమైంది. ఈ ఘనతకు గుర్తింపుగా మే 29న గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో స్కూల్ నిర్వాహకులు పాస్టర్ అగస్టీన్ దండింగి చేతుల మీదుగా గిన్నీస్ రికార్డు సర్టిఫికెట్ అందుకుంది.