బీజేపీ నాయి బ్రాహ్మణ సెల్ జిల్లా కన్వీనర్గా జనపాల శ్రీకాంత్ నాయి
NEWS May 31,2026 11:37 pm
కామారెడ్డి: బీజేపీ నాయి బ్రాహ్మణ సెల్ జిల్లా కన్వీనర్గా జనపాల శ్రీకాంత్ నాయిని నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయి బ్రాహ్మణ సెల్ కన్వీనర్ ఆనంద్ కుమార్ నాయి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు రాష్ట్ర కో-కన్వీనర్ నందు నాయి తెలిపారు.పార్టీ బలోపేతం, నాయి బ్రాహ్మణ వర్గ సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలులో శ్రీకాంత్ నాయి కీలక పాత్ర పోషించాలని నాయకత్వం ఆకాంక్షించింది. ఈ సందర్భంగా నియామకంపై హర్షం వ్యక్తం చేసిన శ్రీకాంత్ నాయి, పార్టీ ఆశయాల సాధనకు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.